వారికి మాత్రమే కరోన వ్యాక్సిన్ ఫ్రీ.. అది కూడా అక్కడ మాత్రమే..!
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే కోట్ల మంది దీని బారినపడ్డారు. లక్షల మంది కరోనా బారినపడి మరణించారు. అయితే ఎట్టకేలకు ఈ మహమ్మారికి చెక్పెట్టేందుకు వ్యాక్సిన్ వచ్చింది. అయితే ఈ వ్యాక్సినేషన్ వీలైనంత త్వరగా వేసేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. తొలి విడతగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభిస్తున్నారు. ఇక మార్చి 1వ తేదీ నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ డ్రైవ్కు రంగం సిద్దం చేశారు. ఈ దశలో 60 ఏళ్లపై బడ్డ వారితో పాటుగా.. 45 ఏళ్ల వయస్సు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ వేయనున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ తొలుత ఉచితంగా అందజేస్తారని ప్రకటించారు. అయితే అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయడం కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేవలం కొందరికి మాత్రమే వ్యాక్సిన్ ఉచితంగా వేయనున్నట్లు ప్రకటించింది. అది కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే. ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం వ్యాక్సిన్కు రుసుము చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అయితే వ్యాక్సిన్ ధర ఎంత అన్నది ఇంకా తెలియజేయలేదు. మరో మూడు నాలుగు రోజుల్లో వ్యాక్సిన్ ధరపై ఓ క్లారిటీ రానుంది.
ఈ కరోనా వ్యాక్సిన్ను అరవై ఏళ్లు దాటిన వారితో పాటు.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ ఉచితంగా వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యాక్సిన్ ఫ్రీగా వేయనున్నారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ఫీజు చెల్లించాల్సి వస్తుందన్నారు.ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన క్యాబినెట్.. రెండో విడుత కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్పై నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.‘ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ రెండో దశ మార్చి 1వ తేదీ నుంచి మొదలవుతుందన్నారు. దేశంలో 60 ఏళ్లు దాటినవారు 10 కోట్ల మందికి పైగా ఉన్నారన్నారు. వీరితోపాటుగా 45 ఏళ్లు దాటి.. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఎక్కువమందే ఉన్నారని.. వీరందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ వేస్తారన్నారు. ఇందుకు 10 వేల ప్రభుత్వ ఆస్పత్రులను, 20 వేల ప్రైవేటు ఆస్పత్రులను ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధర ఎంత అన్నది మరో మూడు నాలుగు రోజుల్లో నిర్ణయిస్తామన్నారు.