ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా, పెట్రోలుపై లీటర్కు రూ.8 తగ్గింపు, డీజిల్పై రూ.6 తగ్గింపుపై పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత, కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను ప్రభావితం చేసే ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై ప్రతిపక్షాల విమర్శలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం వివరణ ఇచ్చారు. ఆ సమాచారాన్ని ఆర్థిక మంత్రి వరుస ట్వీట్లలో షేర్ చేశారు.
బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ (BED), స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED), రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ (RIC) సహా అగ్రికల్చర్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ (AIDC) కలిసి పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని ఏర్పరుస్తాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రాథమిక ED మాత్రమే కేంద్రం రాష్ట్రాలతో పంచుకుంటోంది, అయితే SAED, RIC & AIDC మాత్రం రాష్ట్రాలతో భాగస్వామ్యం చేయదు కేంద్రం. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఈ నాన్-షేరబుల్ భాగంలోనిది, ఇది పూర్తిగా కేంద్రం భరించింది అని ఆమె అన్నారు.
ఇంధన ఎక్సైజ్ డ్యూటీలో రూ. 8/లీటర్ తగ్గింపు, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీలో రూ. 6/లీటర్ తగ్గింపు (రెండూ 22 మే 2022 నుంచి అమలులోకి వచ్చాయి) పూర్తిగా రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ (RIC) ద్వారా నిధులు సమకూర్చామని ఆమె పేర్కొంది. నవంబర్ 2021లో కూడా RICలో రూ.5/లీటర్ పెట్రోల్, రూ.10/లీటర్ డీజిల్ ధర తగ్గింపులు పూర్తిగా జరిగాయని ఆమె తెలిపారు. రాష్ట్రాలతో పంచుకోదగిన ప్రాథమిక EDని ముట్టుకోలేదు. కాబట్టి, ఈ రెండు డ్యూటీ కోతల (నవంబర్ లో జరిగిన తగ్గింపు, నిన్న జరిగిన) మొత్తం భారాన్ని కేంద్రమే భరిస్తుంది” అని ఆమె అన్నారు.
విపక్షాలను మరింత దూషిస్తూ, ఆర్థిక మంత్రి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, 2004 నుంచి 2014 వరకు రూ. 49.2 లక్షల కోట్లతో పోల్చితే, 2014 నుంచి 2022 వరకు మోడీ ప్రభుత్వం రూ. 90.9 లక్షల కోట్లు ఖర్చు చేసిందని సూచించారు.
ఆదివారం నుంచి సుంకం తగ్గింపు వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ. 10 లక్షల కోట్లు.. నవంబర్ 2021లో సుంకం తగ్గింపు వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ. 1,20,000 కోట్లు ఇప్ప్పటికే ఖర్చవుతుందని ఆమె పేర్కొన్నారు.
ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీలపై మోదీ ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు ఇప్పటివరకు రూ. 24.85 లక్షల కోట్లు, మూలధన వ్యయంగా రూ. 26.3 లక్షల కోట్లు ఖర్చు చేసామని.. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లలో కేవలం రూ. 13.9 లక్షల కోట్లు సబ్సిడీల కోసం ఖర్చు చేశారని సీతారామన్ తేల్చారు.
కేంద్ర ప్రభుత్వం మే 21న పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో సగటున పెట్రోల్ ధర రూ.9.5, డీజిల్ ధర రూ.7 తగ్గింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)