వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోందని ఈసీ పేర్కొంది. వెస్ట్ బెంగాల్లో రెండో దశలో 30 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 10,620 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. కాగా, రెండో దశలో జరిగే అన్ని ప్రాంతాలు సున్నితమైనవని.. ఈ నేపథ్యంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఇక అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 394 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేశామని.. 310 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.