తెలంగాణలో పార్టీల ఫిరాయింపులు జోరుగా కొనసాగుతోన్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ లోంచి బీజేపీ లోకి వలసలు జరుగుతోన్నాయి. తాజాగా భువనగిరి జిల్లాలోని గట్టుప్పల్, చండూర్, ఘట్కేసర్ మండలాల్లోని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలను బీజేపీ జాయినింగ్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మండల ఎంపిపి సుదర్శన్ రెడ్డి, మండల జనరల్ సెక్రెటరీ కోమటిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు బాలు యాదవ్, ఆశ్వపూర్ సర్పంచ్ కావేరి మత్చెందర్ రెడ్డి సహా తదితరులు బీజేపీలో చేరారు.