అసోంలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరగడం కారణంగా మూడు ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పటి వరకు 25 మందిని మరణించారు, అసోంలో అత్యధిక నష్టం వాటిల్లింది.
అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) అందించిన సమాచారం ప్రకారం, శుక్రవారం అర్థరాత్రి ఇద్దరు పిల్లలు సహా నలుగురు వ్యక్తులు నీటిలో మునిగిపోయారు. విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పుడు తొమ్మిదికి చేరుకుంది. మే 14 నుంచి ఇప్పటి వరకు మరో ఐదుగురు కొండచరియలు విరిగిపడి చనిపోయారు.
“ అసోంలో 29 వరద ప్రభావిత జిల్లాల్లో దాదాపు 7.12 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు, మధ్య అస్సాంలోని నాగోన్లో పరిస్థితులు విషమంగా ఉంది. ఇప్పటి వరకు 74,705 మందిని 234 సహాయ శిబిరాలకు తరలించామని” ASDMA ప్రతినిధి తెలిపారు.
అస్సాం అంతటా కనీసం 20 డైక్లు తెగిపోయాయని, అనేక వంతెనలు కొట్టుకుపోయాయని.. ముంపునకు గురైన 2,251 గ్రామాలలో 43,090 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని.. అనేక రోడ్లు వాహనాలు వెళ్లేందుకు పనికిరాకుండా పోయాయని ASDMA నివేదిక పేర్కొంది.