ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదుల సంఖ్య ఎంతో తెలుసా. వంద. వేర్వేరు ఎన్కౌంటర్లో వంద మందిని కాల్చిపారేసినట్టు అధికారులు తెలిపారు. పోలీసులు, ఆర్మీ చేతుల్లో చనిపోయిన టెర్రరిస్టుల్లో అత్యధికంగా 63 మంది నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన వారు. కాగా జేషే మొహమ్మద్ కు చెందిన 24 మంది టెర్రరిస్టులూ ఆ జాబితాలో ఉన్నారు. వేర్వేరు ఆపరేషన్లలో చనిపోయిన తీవ్రవాదుల్లో భారత్ కు చెందని వారు 29 మంది. గతేడాది ఇదే ఆరునెలల కాలానికి భద్రతాదళాలు మట్టుపెట్టిన టెర్రరిస్టులతో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలు.
గతేడాది ఈ సమయానికి 50 మందిని కాల్చి చంపగా అందులో ఒక ఉగ్రవాది విదేశీయుడు.