మగధిలోని సంస్కృత యూనివర్సిటీకి వంద ఎకరాలు కేటాయించింది కర్నాటక ప్రభుత్వం. దాదాపు పదేళ్లనుంచి విశ్వవిద్యాలయ కార్యకలాపాలు నడుస్తున్నాయి కానీ సొంత క్యాంపస్ లేదు. తాజాగా భూమిని కేటాయిస్తున్నట్టు ప్రకటించిన సీఎం బస్వరాజ్ బొమ్మై ఇవాళ శంకుస్థాపన చేశారు. 320 కోట్ల నిధులతో వంద ఎకరాల్లో విశ్వవిద్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తికానున్నాయి. 2010లో యూనివర్సిటీకి అనుమతి ఇచ్చినా భూసేకరణకు పలు సమస్యలు వచ్చాయి. ఈ యూనివర్సిటీ కింద 2 సంస్కృత కళాశాలలు, 10 ఎయిడెడ్ కాలేజీ, 9 అన్ ఎయిడెడ్ కాలేజీలున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఇవాళ రామనగర జిల్లాలో అడుగుపెట్టారు బొమ్మై. ఇంకా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.