సుప్రీం కోర్టు చరిత్రలో మరోసారి మహిళా బెంచ్ కొలువుదీరింది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనాన్నిఏర్పాటు చేశారు చీఫ్ జస్టిస్..జస్టిస్ డీవై చంద్రచూడ్. ఇవాళ మహిళాధర్మాసనం కేసుల విచారణ ప్రారంభించింది.కేవలం మహిళా న్యాయమూర్తులతో సుప్రీం బెంచ్ ఏర్పాటుకావడం ఇది మూడోసారి. 2013లో తొలిసారి జస్టిస్ జ్ఞానసుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రసాద్ దేశాయ్ లతో మహిళా బెంచ్ ఏర్పాటు చేశారు. 2018లో రెండోసారి జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో మహిళాబెంచ్ ఏర్పాటైంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 27 మంది జడ్జిలుండగా వారిలో ముగ్గురు మహిళలున్నారు. జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ నాగరత్నం, జస్టిస్ బేలా త్రివేదిలు ఒకేసారి గతేడాది అగస్టులో ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో బీవీ నాగరత్న ప్రధానన్యాయమూర్తి రేసులో ఉన్నారు. 2027లో ఆమె సీజేఐగా నియమితులయ్యే అవకాశాలున్నాయి.

Justice Hima Kohli (left) and Justice Bela M Trivedi