గత వారం జనవరి 6వ తేదీన కర్ణాటక లో మంగుళూరు లో నివసిస్తున్న “ముందాదిగుట్టు సదానంద మర్ల” అనే ఒక హిందూ తండ్రి ఈ క్రింది విధంగా పత్రికా ప్రకటన ఇచ్చాడు.
” మొన్న జనవరి 3వ తేదీన NIA చే అరెస్ట్ చేయబడిన MS దీప్తి మర్ల నా స్వంత బయలాజికల్ కూతురు. ఈ రోజు నుండి MS దీప్తి మర్ల తో మాకు ఎటువంటి సంబంధాలు లేవు. ఆమె చేసిన పనులు అన్నీ పూర్తిగా ఆమె ఇష్టపూర్వకంగా చేసినవే, ఆమె గతంలోనూ, తన పెళ్లి తరువాత చేసిన పనులతో ప్రస్తుతం కానీ భవిష్యత్ లో కానీ మాకు సంబంధం లేదు. ఆమె చేసిన పనులకు ఆమె ఆమెనే నిందించుకోవాలి, మాకు ఇప్పుడు కానీ భవిష్యత్ లో కానీ ఆమె చర్యలకు బాధ్యత లేదు. ఆమె కానీ ఆమె భర్త కానీ పిల్లలు కానీ మా ఆస్తిలో వాటా పొందజాలరు. “
ఇట్లు
ముందాదిగుట్టు సదానంద మర్ల
కుషాల్ నగర్, BK ధనలక్ష్మి మర్ల
06.01.2022. ముందాదిగుట్టు దర్శన్ మర్ల
దీని వెనుక కధ :
ఈ దీప్తి అనే అమ్మాయి మంగళూర్ లో డెంటల్ చదువు అదే BDS చదువుతూ ఉండగా అనస్ అనే ముస్లిం యువకుని తో ప్రేమలో పడి తల్లితండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా వారిని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని ఇస్లాం మతం స్వీకరించి మరీయం గా పేరు మార్చుకుంది. అంతవరకు ఓకే.
కానీ ఆ మధ్య కాలంలో అంటే 2021 ఆగస్ట్ నెలలో ఇసిస్ తో సంబంధాలు ఉన్నాయి అనే అనుమానంతో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA) బాషా అనే అతని ఇంటిపై దాడి చేసి అతని ఒక కొడుకు అయిన అమర్ అబ్దుల్ రెహ్మాన్ ని అరెస్ట్ చేశారు. అప్పుడే బాషా (మరో కొడుకు భార్య) కోడలు మరియంపై అనుమానం వచ్చి రెండు రోజులు విచారించి వదిలేసి ఆమె కార్యకలాపాలపై నిఘా పెట్టారు. మొన్న జనవరి 3వ తేదీన మళ్లీ బాషా ఇంటిపై దాడి చేసి మరో కొడుకు అనస్ అబ్దుల్ రెహ్మాన్ భార్య మరియు భాషా కోడలు(ఆగస్ట్ లో విచారించి వదిలేసిన ఆమె) మరియం ని అరెస్ట్ చేశారు. ఈ బాషా ఇదినబ్బ అనే కర్ణాటక మాజీ ఎమ్మెల్యే కొడుకు.
NIA విచారణలో తేలింది ఏమిటంటే సిరియా మొదలగు చోట్ల ఇసిస్ బలహీన పడ్డాక కాశ్మీర్ లో దానిని బల పరచడానికి, యువకులను రిక్రూట్ చేసుకుందికి జనవరి-మార్చ్ 2020 కాలంలో వీరి జంట కాశ్మీర్ వెళ్లినట్లు తేలింది.
ఈ దీప్తి మార్ల ఈ ఇసిస్ నియామకానికి కింగ్ పిన్ అని తేలింది. ఇంకా బయటకు వచ్చిన సమాచారం ఆధారంగా మరో 11 మందిని అరెస్ట్ చేశారు.
ఇంకా లోతైన విచారణ చేస్తున్నారు.
కేరళలో ఇది మొదటి సంఘటన కాదు. చాలా జరుగుతున్నాయి. కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి.
2011లో సోనియా సెబాస్టియన్ అనే అమ్మాయి
అబ్దుల్ అనే అతన్ని ప్రేమించి వివాహం చేసుకుని ఒక కూతుర్ని కని ఆ కూతురుతో సహా 2016లో ఇసిస్ లో జాయిన్ అవ్వడానికి ఇండియా నుండి పారిపోయారు. కేరళ నుండి ఎక్కువ మంది ఐసిస్ లో జయిన అవ్వడానికి వీరు సహాయం చేస్తున్నారు అని NIA వీరి మీద UAPA తీవ్రవాద చట్టం క్రింద కేస్ పెట్టారు. అబ్దుల్ అక్కడ ఎదురు కాల్పులు లో చనిపోతే సెబాస్టియన్, ఆమె కూతురు అఫ్గాన్ వస్తే అక్కడ పట్టుబడి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈమెతో పాటు ఇంకో ఇద్దరు భారతీయ స్త్రీలు నిమేశ, రఫెలా కూడా అక్కడ జైల్లో వున్నారు.
తన కూతురును, మనుమరాలును అఫ్గాన్ నుండి ఈ దేశం తీసుకురావాలి అని కేంద్రాన్ని ఆదేశించమని కోరుతూ ఈ నెల సోనియా సెబాస్టియన్ తండి సుప్రీమ్ కోర్ట్ లో కేసు వేస్తే కేంద్రం ఈ విషయంపై నిర్ణయం తీసుకుంది కి సుప్రీమ్ 8 వారాల గడువు ఇచ్చింది.
కేరళలో ఇటువంటి ప్రేమ వివాహ కేసులు డజన్ల కొద్దీ జరుగుతున్నాయి. ఈ ప్రేమ వ్యవహారాలకు భయపడ్డ కేథలిక్ చర్చి క్రిష్టియన్ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది.
మతతత్వ బిజేపి ఎలాగూ లవ్ జిహాద్ గురించి చాలా రోజుల నుండి గొడవ చేస్తోంది. సెక్యులర్ పార్టీలు, ఉదార మేధావులు బిజేపి ని తిడుతూ వున్నారు.
కానీ విచిత్రంగా కేరళ కమ్యునిస్ట్ పార్టీ ముఖ్య మంత్రి పినారయ్ విజయన్ కూడా ఈ విషయంపై హెచ్చరిక జారీ చేశాడు. కొన్ని మతతత్వ శక్తులు కాలేజీ అమ్మాయిలని టెర్రరిజం వైపు ప్రేరేపిస్తున్నారు జాగ్రత్తగా వుండండి అని చెప్పాడు.
మన బంగారం మంచిది కానప్పుడు ఎవరినో నిందించి ప్రయోజనం లేదు. ముఖ్యంగా హిందువులు డబ్బు, హోదాల యావలో పడి కుటుంబాలను పిల్లలను పట్టించుకోవడం మానేస్తున్నారు. ఇళ్లల్లో హిందూ సంస్కృతికి భారతీయ కుటుంబ విలువలకు తిలోదకాలు ఇస్తూ కొత్తగా తెచ్చిపెట్టుకున్న విదేశీ ఉదార విశాల భావాలు పెంచిపోషిస్తూ కుటుంబ బాంధవ్యాలను బలహీన పరుచుకుంటున్నారు.
హిందూ తల్లి తండ్రులు ఎంత తొందరగా కళ్ళు తెరిస్తే అంత మంచిది. లేకపోతే, తరువాత పైన చెప్పిన అభాగ్య తండ్రులు లాగా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మిగులుతుంది.
Courtesy :- Chada Shastry





