కశ్మరీ హిందువుల ఊచకోత, తరిమివేతను ది కశ్మీర్ ఫైల్ పేరుతో తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి టీంకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సంయుక్త రాష్ట్రం ఓహియో సెనేటర్ నీరజ్ అంటానీ ఆ బృందాన్ని సత్కరించింది.
“ది కాశ్మీర్ ఫైల్స్ రచయిత సహా దర్శకుడిగా ఈ గౌరవానికి వివేక్ అర్హులు కాశ్మీరీ పండిట్ల ఊచకోత, తరిమివేతపై మంచి చిత్రాన్ని నిర్మించారు. ఇది మీ విజయం. ఇందుకు గర్వపడండి అంటూ సెనేటర్ మాట్ హఫ్ఫ్మన్, ఒహియో సెనేట్ ప్రెసిడెంట్ తోపాటు స్టేట్ సెనేటర్ నీరజ్ అటానీ సంయుక్తంగా ఆ అనులేఖనంపై సంతకం చేశారు.
దీనికి కృతజ్ఞతగా స్పందించారు వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పైల్స్ టీం, అలాగే ప్రేక్షకులందరి తరపునా ఒహియో సెనేట్ కి కృతజ్ఞతలు చెబుతున్నానని , ప్రపంచం మొత్తం కశ్మీరీ హిందువులపై జరిగిన మారణహోమాన్ని తెలుసుకుందని… భారత్ మానవత్వవిలువలనూ గుర్తిస్తోందని. ఆర్టికల్ 370ని రద్దు చేసిన మోదీకి ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు వివేక్.
https://twitter.com/vivekagnihotri/status/1511552545277157381?s=20&t=rNBAaHXZ-iHOrAoOqDaXgA
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)