12 చీతాలు దక్షిణాఫ్రికానుంచి భారత్ రానున్నాయి.భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో జోహన్నెస్ బర్గ్ నుంచి అవి భారత్ వస్తున్నాయని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్రయాదవ్ తెలిపారు. వాడిలో ఏడు ఆడవి, కాగా ఐదు మగవి. మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో వాటిని వదిలిపెట్టనున్నారు. వాటికోసం అక్కడ ఎన్ క్లోజర్లుసిద్ధం చేసి ఉంచారు. దేశంలో చీతాల సంఖ్య పెంపు సంరక్షణపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. అందులో భాగంగా నమీబియా నుంచి 8 చీతాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కూనో జాతీయ పార్కులోనే ఉన్న అవి ఇక్కడి వాతావరణానికి పూర్తిగా అలవాటుపడిపోయాయి.