ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ ఎంపిక అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ భూపేంద్ర యాదవ్ విడివిడిగా ఎమ్మెల్యేలు అభిప్రాయాలు సేకరించారు. పార్టీ సీనియర్ నేతలు నుంచి వివరాలు తీసుకున్నారు అనంతరం హై కమాండ్ తో మాట్లాడి మోహన్ ఎంపికను ఖరారు చేశారు.
బిజెపితో దాదాపు 30 సంవత్సరాల అనుబంధం మోహన్ చరణ్ కి ఉన్నది. ఒడిశాలోని మారుమూల అటవీ ప్రాంతం నుంచి ఆయన ఎదిగారు. కాలేజీ చదువు కోసం బాగా దూరంగా ఉన్న పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఉండే సౌకర్యాలు తమ గూడెం ప్రజలకు లేవని ఆవేదన చెందారు. పల్లె ప్రజలకు కనీస అవసరాలు కల్పించాలి అంటే రాజకీయ పోరాటం తప్పదని ఆయన గుర్తించారు అందుచేతనే ఉద్యోగాన్ని పక్కనపెట్టి రాజకీయాల బాట పట్టారు. అప్పటికి ఒడిశా లో బిజూ జనతా దళ్.. చాలా చాలా బలమైన పార్టీ. బిజెపి కి ఏమాత్రం పట్టు లేని పరిస్థితి.
అయినప్పటికీ అడవుల్లో గిరిజన ప్రజల కోసం వనవాసి కళ్యాణ పరిషత్ వంటి సంస్థలు చేస్తున్న సేవలు మోహన్ చరణ్ మమేకమయ్యారు.
అనంతరం ఆయా ప్రాంతాల్లో బిజెపి విత్తనాలు నాటి,, పార్టీని పటిష్టం చేస్తూ వచ్చారు. మారుమూల గూడెం ప్రాంతాల్లో పర్యటించడం కష్టమైనా అంశం. అయినప్పటికీ మోహన్ చరణ్ ఆ చుట్టుపక్కల గూడాలన్నీ క్రమం తప్పకుండా పర్యటించడం అలవాటు చేసుకున్నారు. అక్కడ ప్రజల అవసరాలు గుర్తించి అసెంబ్లీలో వాటి మీద పోరాడుతూ ఉండేవారు. ఇప్పటిదాకా నాలుగు సార్లు శాసనసభలో గిరిజనులకు ప్రాతినిధ్యం వహించారు. ఒడిస్సా అసెంబ్లీలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. ప్రజల కోసం పోరాటం చేసే మోహన్ చరణ్ వ్యక్తిగతంగా సౌమ్యులు. వివాదాలకు దూరంగా ఉంటారు.
ఒడిశాలో బిజెపి పార్టీని బలపరచడమే ఏకైక లక్ష్యంగా ఆయన పని చేస్తూ వచ్చారు. నిరంతరాయంగా పనిచేయడం వివాదాలకు దూరంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చింది. దీంతో ఒడిస్సా లో బిజెపి తరఫున మొట్టమొదటి ముఖ్యమంత్రి అవకాశం ఆయనకి కల్పించారు.