ఒడిశాలోని పూరీలోని శ్రీ జగన్నాథ దేవాలయంలో వంట గదిలో ఉన్న దాదాపు 40 మట్టి పొయ్యి(చుల్హా)లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ పొయ్యిలను జగన్నాథునికి, అతని తోబుట్టువులైన దేవతలకు అర్పించే రాజ్ భోగాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే విధ్వంసానికి గురైన పొయ్యిల సంఖ్యపై స్పష్టత లేదు. జీ న్యూస్ ఒడిషా ఎడిటర్ సాస్వత్ పాణిగ్రాహి 90 పొయ్యిలు విధ్వంసానికి గురయ్యాయని ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ఘటనలో 100కు పైగా పొయ్యిలు ధ్వంసమైనట్లు ఇండియా టుడే నివేదించింది. ఆదివారం ఈ ఘటన జరిగినట్టు ఆలయ అధికారులు ధ్రువీకరించారు.
https://twitter.com/NewIndianXpress/status/1510576598898163712?s=20&t=jbq5XzFek9pmK81Mf4qUow
పొయ్యిల ధ్వంసం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ సమర్థ వర్మ, ఎస్పీ వీకే సింగ్తో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. వారేమో 40 పొయ్యిలను ధ్వంసం చేశారని…నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈఘటన భక్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోగలమని… అయితే రెండు రోజుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని కలెక్టర్, ఆలయ అధికారులు హామీ ఇచ్చారు.
అయితే స్వామికి నైవేద్యాలు సిద్ధం చేసే ఒకటి లేదా రెండు ‘కోత చుల్హా’లను మాత్రమే పూర్తిగా ధ్వంసం అయ్యాయని… మిగిలినవి బాగానే ఉన్నాయని…ఆలయ ఆచారసంప్రదాయాలు దెబ్బతినకుండా చూస్తామని…ఉదయం ప్రసాదం అందించడంలో ఒక అరంగట ఆలస్యం అయిందని చెప్పుకొచ్చారు.
https://twitter.com/SaswatPanigrahi/status/1510623756443549701?s=20&t=AZGSU2kfnQQtmj_VwFxHPg
శ్రీ జగన్నాథ దేవాలయం 12వ శతాబ్దానికి చెందినది. రికార్డుల ప్రకారం, వంటగదిలో మొత్తం 240 నమోదైన పొయ్యిలు ఉన్నాయి, వాటిలో 40 దెబ్బతిన్నాయి. అక్కడ ‘మహాప్రసాదం’ మట్టి కుండల్లోనే వండుతారు. దాదాపు 400 మంది వంట మనుషులు, 200 మంది సహాయకులు మహా ప్రసాదం తయారు చేసే పనిలో నిమగ్నమై ఉంటారు. భక్తులు ఆనంద బజార్లో ఈ ‘మహాప్రసాదం’ పొందుతారు.
వంటగది లోపల వంట చేసే వారిని మాత్రమే అనుమతిస్తామని.. అందువల్ల, సాంప్రదాయ కర్మలను పూర్తి చేయడంలో వివాదం ఏర్పడిన నేపథ్యంలో శనివారం రాత్రి కొందరు సేవకులు ఈ పొయ్యిలను ధ్వంసం చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.