స్వాతంత్ర పోరాటంలో జరిగిన అపశృతులు వాటి కొనసాగింపు ఈ 75 సంవత్సరాలలో ఎలా ఉన్నాయో ఒకసారి సమీక్షా చేసుకోవటం చాలా అవసరం. ఈ దేశం 1947 ఆగస్టు 14న రెండు ముక్కలైంది, ఈ ముక్కలు కావటానికి శతాబ్దాలుగా భారత్ లో తమ ఆధిపత్యం కోసం పని చేస్తున్న ఇస్లాం శక్తులు వాళ్లకు సహకరించిన బ్రిటిష్ ప్రభుత్వం కారణం.ఆ విభజన శక్తులు ఈరోజున కూడా దేశంలో ఎట్లా పని చేస్తున్నాయి అనేది 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భవిష్యత్ గురుంచి సమీక్ష చేసుకోవటం ఎంతో అవసరం.
బ్రటిష్ పాలనలో ఇస్లాం కార్యకలాపాల పరిణామం దేశవిభజన
భారత్ లో బ్రిటిష్ వాళ్ళు రాక పూర్వం క్రీస్తుశకం 712 నుండి 1857 వరకు ఇస్లాం ఆక్రమణ కొనసాగుతూనే ఉంది. 1857 సంవత్సరం ఈ దేశంలో ఈస్టిండియా కంపెనీ పై పెద్ద ఎత్తున స్వతంత్ర పోరాటం జరిగింది, ఆపోరాటం మొఘల్ రాజునాయకత్వంలో జరిగింది ఆ యుద్ధం లో ఈస్టిండియా కంపెనీ గెలిచింది. ఆ యుద్ధం తో ఈ దేశంలో ఉన్న ఇస్లామిక్ సామ్రాజ్యం కుప్పకూలిపోయి కొన్ని ముస్లిమ్ సంస్థానాలు మిగిలిపోయాయి, దేశం పాలన ఈస్టిండియా కంపెనీ చేతుల్లోనుండి బ్రిటిష్ పార్లమెంటు చేతుల్లోకి వెళ్ళిపోయింది. అప్పటినుండి దేశంలో క్రమంగా బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి, 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది, ఎట్లా వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మనకు అప్పగించి వెళ్ళిపోయారు. అదే ప్రజాస్వామ్యం 75 సంవత్సరాల నుంచి ఈ దేశంలో కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ఓట్ల రాజకీయాలు ఈ దేశంలో ఈ జాతి లో అనేక మార్పులకు దారి తీసింది. అధికారం కోసం అడ్డదారులు త్రొక్కటం క్రమంగాపెరిగింది ఓటుబ్యాంక్ రాజకీయాలు, కులాలు కులసంఘాలు రాజకీయ వ్యూహాలలో భాగమైపోయి సామజిక సమస్యలనుకూడా రాజకీయ దృష్టికోణం నుండి చూడటం మొదలైంది, వీటి దుష్పరిణామాలు దేశాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. 1857 నుండి ఈ దేశంలో ఈ దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన ఇస్లాం చేతులు ముడుచుకుని కూర్చో లేదు బ్రిటిష్ వాళ్ళ సహకారంతో అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నారు 1885లో బ్రిటిష్ వాళ్లు కాంగ్రెస్ సంస్థను ఏర్పాటు చేస్తే 1906 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్లే ముస్లిం లీగ్ కూడా ఏర్పాటు చేశారు .1937 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వంముస్లింల కోసం పార్లమెంట్ లో షరియత్ చట్టాన్ని ఆమోదించారు, ఈ రకంగా ముస్లింలు భారత్ లో తమకు ఒక ప్రత్యేక దేశాన్ని సృష్టించుకునే ప్రయత్నాలు ప్రారంభం చేశారు, వలసలు, మతమార్పిడులు, ఆక్రమణల, ద్వారా కొన్ని భాగాలను ముస్లిం జనాభా పెంచుకుంటూ చివరకు ప్రపంచంలో పాకిస్థాన్ అనే పేరుతొ ఒక క్రొత్త దేశాన్ని సృష్టించుకున్నారు.దేశవిభజనతో వందల సంవత్సరాలుగా దేశం లో ఇస్లాం ఆక్రమణ సమస్య పరిష్కారం అయ్యిందా అంటే కాలేదు అని చరిత్ర చెబుతున్నది .
స్వాతంత్య్రానంతరం విస్తరణే లక్ష్యం –అదే ఇస్లాం వ్యూహం
స్వాతంత్య్రానంతరం ఇస్లాం సమస్య మరో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఈ దేశంలో ప్రయత్నపూర్వకంగా ముస్లిం జన ఆదిక్యత ఉన్న ప్రదేశాలను నిర్మాణం చేసుకోవడానికి నిరంతర ప్రయత్నాలు ఎటువంటి దాపరికం లేకుండా చేసుకుంటూనే వస్తున్నారు. వాళ్ల సంఖ్య ఆధిక్యత ఉన్న ప్రదేశాలలో ముస్లిమేతరులు గనక ఉన్నట్లయితే వాళ్లను నయానా భయానా అక్కడినుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసి వాళ్ళును అక్కడ నుండి తమ ఇళ్లను ముస్లింలకు అమ్మివేసి బయటకు వెళ్లిపోయెట్లు చేసేవారు మొత్తానికి ఆ ప్రదేశాలలో ముస్లిమేతరుల ఉండనిచ్చేవాళ్ళు కాదు. మతకలహాల చరిత్ర గనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ముస్లిం జనాభా అధికంగా ఉన్న చోట్ల ఉన్న హిందువుల మీద జరిగే దాడులు ప్రధానమని మనకు అర్థమవుతుంది.ఈ దాడులు అనేక రకాలు తమ ఆధిపత్యం కోసం ఇతరులు ఆ ప్రదేశాలలో ఎటువంటి ర్యాలీలు జరగనిచ్చేవాళ్ళు కాదు అది పెండ్లిళ్ళు ఊరేగింపు కావచ్చు లేక పండుగ ఊరేగింపులు కావచ్చు దానికి తాజా ఉదాహరణ ఈమధ్య కొద్ది నెలల క్రితం జరిగిన రెండు ఉదాహరణలు మనకు కనబడతాయి 1) ఉత్తరప్రదేశ్ ఎన్నికల కంటే ముందు ముస్లిం ఆధిక్యత ఉన్న గ్రామంలో ఒక పెండ్లి ఊరేగింపు జరిగింది మా మసీదు ముందు నుంచి మీరు ఊరేగింపు తీస్తారా అని వాళ్ల పై దాడి చేశారు, ఆ గ్రామంలో హిందువుల ఇళ్లపైన బలవంతంగా” ఇల్లుఅమ్మబడును” అని రాయించారు ఇల్లుమాకు అమ్మేసి వెళ్ళిపొండి అని బెదిరించారు, అంటే తమ ఆధిపత్యం ఉన్న దగ్గర మాదే రాజ్యం ఇతరులు ఎవరూ అక్కడ ఉండకూడదు, భాగ్యనగరంలో కూడా పాతబస్తీ నుండి ఎందరో తమ ఇళ్లను ముస్లిములకు అమ్మేసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు ముస్లిం ఆక్రమణ ఆధిపత్యం ఎట్లా ఉంటుందో మనకు అర్థచేసుకోవలసిన అవసరం ఉన్నది. 2) ఈమధ్య శ్రీ రామ నవమి హనుమత్ జయంతి సందర్భం గ దేశంలో కొన్ని ప్రాంతాలలోదాడులు జరిగాయి.ఇవి ఏవో క్రొత్తగా జరిగినట్లు మన నాయకులూ పత్రికలూ వ్యాఖ్యనించటం హిందువులు ముస్లింలు దేశం లో కలిసి మెలసి ఉంటున్నారు అని మాట్లాడటం చూస్తుంటే దాడులకు హిందువులే కారణం అన్నట్లుగా ఉన్నది . ఇవి అన్నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఈ దేశం లో అనేక రాజకీయ పార్టీల వాళ్ళు అధికారం కోసం ముస్లిం లను సమర్ధిస్తారు. ఆ చరిత్రను కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది, అప్పుడే స్వాతంత్ర అనంతరం భారత్ లో ఇస్లాం ఏమిటో అర్థమవుతుంది. ముస్లింలకు భారత్ లో రక్షణ లేదు అని ఉదారవాద మేధావులు వామపక్ష వాదులు దేశంలో విదేశాలలో గగ్గోలు పెడుతూ ఉండటం కనబడుతుంది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇస్లాం ఆధిపత్యాన్ని ఒత్తిడిని ప్రశ్నించి దేశంలో ప్రజలందరూ శాంతియుతంగా ఉండేందుకు ఏమైనా ప్రయత్నాలు జరిగాయి అంటే పెద్దగా ఏమీ జరగలేదు అని చెప్పవచ్చు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ముస్లిం జనాభా ఆదిక్యత ఉన్న ప్రదేశాలు ముస్లిముల దే ఆధిపత్యం ఇట్లా జరక్కుండా ఉండటానికి ఏమి ప్రయత్నం చేయాలి,ముస్లిం మత పెద్దలు వాళ్లతో మాట్లాడుతూ దాడులు జరగకుండా చూడలేరా ,ముస్లిం ఆధిక్యత ఉన్న ప్రాంతాలలో నివసించే ఇతర మతస్థులు శాంతియుతంగా ఉండేందుకు పరస్పరం చర్చలు జరుగుతాయా అంటే అంతగా ఉండవు అని చెప్పవచ్చు. ఈమధ్య తాజా ఉదాహరణ హైదరాబాద్ పాతబస్తీలో కరెంటు బిల్లులు కట్టలేదని ఇళ్లకు వెళ్ళిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లపై దాడులు జరిగాయి, ఈ దాడులను ఏ ముస్లిం నాయకుడు ఖండించలేదు ఏ సెక్యులర్ నాయకుడు ప్రశ్నించలేదు, ప్రభుత్వం ఏమి చర్య తీసుకుందో తెలియదు, కానీ వెళ్ళిన వాళ్ళు మాత్రం బలి పశువుల అయినారు, ఇటువంటివి జరిగినప్పుడు మందలించ క పోవటం వాళ్లను ప్రోత్సహించడమేఅవుతుంది దానిని ప్రశ్నించ వలసిన అవసరం లేదా? విద్వేషాలు రెచ్చగొట్టే వారికి సహకరించటం సరైన చర్యలు తీసుకోకపోవటం ఏమనాలి? దేశంలో ఎక్కడైనా ఇటువంటి విషయాలపై ఎవరైనా చర్యలు తీసుకుంటే వారిపై ఎగబడి ప్రశ్నించేవావాళ్ళు అనేక మంది కనపడుతూ ఉంటారు, ఇదే వాళ్లకు అంటే ముస్లింలకి బలం చేకూరుస్తున్నది ఈ ప్రశ్నించే వాళ్ళు గొడవల్లో ముస్లిములతో కలిసి ఉన్న సందర్భాలు కూడా అనేకం కనపడతాయి. దేశంలో అనేక గొడవలు సంఘటనలు కులాల సంఘర్షణలు కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి ఇటువంటి వాటిపై ఎవరు ఎందుకు సరియైన స్పందన ఉండదు ఎందుకంటే ఎన్నికల రాజకీయాలు అధికార లాలస దీనికి ప్రధాన కారణం మరో విచిత్రం ఈ మధ్య 26 ఏప్రిల్న దేశంలో పదవీ విరమణ పొందిన బ్యూరోక్రాట్లు ఒక ప్రకటన చేశారు వీళ్ళందరికీ కీ పరిస్థితులపై పూర్తి అవగాహన తప్పకుండా ఉంటుంది అయినా వాళ్లు మోడీని ప్రశ్నిస్తూ ప్రకటన చేయటం అంటే వారిపైన ఎవరిదైన వత్తిడి ఉన్నదా?వాళ్లతో మనకు గొడవలు ఎందుకు అని భావిస్తున్నారా , దాడులను ఖండించకుండా ఆ తదనంతరం జరిగిన ప్రభుత్వ చర్యల పై ప్రశ్నించటం ఎట్లా అర్థం చేసుకోవాలి? అట్లాగే ప్రభుత్వం చర్యలపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొవటం , పరిస్థితులు చేజారుతున్నాయని భయంతో సెక్యులర్ నాయకులు, బహుశా ఢిల్లీ పాలకులు పరిస్థితులు తమ చేతుల నుండి బయటపడకుండా ఏవో చర్యలు చేపడుతున్నారు, దానికి తాజా ఉదాహరణ ఢిల్లీ ఈశాన్య ప్రాంతాలలోని జహంగీర్ పూర్ లో దాడులు జరిగిన ప్రదేశంలో 500 మంది హిందువులు ముస్లింలు జాతీయ జెండా చేతిలో పట్టుకుని ర్యాలీ నిర్వహించడం వాళ్లకు రక్షణ కల్పించేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది, దాడులకు కారణం స్థానికులు కాదు బయట వాళ్లు అని కొందరు మాట్లాడారు స్థానికుల సహకారం లేకుండా బయట వాళ్ళు ఇటువంటి దాడులు చేయగలరా ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి. ఇక్కడే ఇంకో రెండు విషయాలను మనం గమనించాలి 1)భారత్ లో ఉదారవాదులు, వామపక్షలు సిద్ధాంతా లా వాళ్ల సిద్ధాంతం ప్రకారం హిందుత్వం అంటే ఇస్లాం క్రైస్తవం లాగా ఒక మతం అది జాతి కాదు అసలు భారత ఒక దేశం ఒక జాతి కాదు అది ఒక ఉపఖండము. హిందూ మతతత్వ వాదులు మైనారిటీలపై దాడులు చేస్తున్నారు వాళ్లను రక్షించడం మా బాధ్యత అంటున్నారు. ముస్లింలు మత సహనం కలిగిన వాళ్ళు, భారత్ లోని ముస్లింలు ఇస్లాం చరిత్ర అద్భుతమైన సహజీవనానికి ప్రతీకగా బోధిస్తుంటారు,
హిందువులే హిందుత్వం పై ఎడతెగనిదాడి చేస్తున్నారా ?
ఆర్ ఎస్ ఎస్ మతతత్వ శక్తి దాడులు చేస్తూ ఉంటారు, ఆర్ ఎస్ ఎస్ దేశద్రోహి అని పుస్తకాలు రాస్తూంటారు, ఈమధ్య ఏజీ నూరాని ఆర్ ఎస్ ఎస్ దేశానికి ప్రమాదం అనే పుస్తకం రాశారు. వాళ్ళ ఆలోచన లో ముస్లిం జరిపిన దాడులు ఆక్రమణలు మతమార్పిడులు దోపిడీలు ఆలయాల విధ్వంసం మొదలైన వాటిని అయితే మరుగున పడేయటం లేదా నిరాకరించడం. ముస్లింలు మరియు వామపక్ష సిద్ధాంత వాదుల మధ్య ఒక అక్రమ సంబంధం ఉన్నదా అని అనిపిస్తుంది, ఎందుకంటే మతాన్ని అంగీకరించని వాళ్ళు మతాలను తిట్టిపోసే వాళ్లు మతతత్వ శక్తులతో ఎట్లా అంటకాగుతున్నారు అనే ప్రశ్నకు వాళ్ల దగ్గర సమాధానం ఉండదు, మతం కానీ హిందుత్వాన్ని మతతత్వ అని ప్రపంచమంతా దుష్ప్రచారం చేస్తున్నారు, అసలు ఈ రోజు ఈ దేశానికి అత్యంత ప్రమాదకారిగా ఉదారవాదులు వామపక్ష సిద్ధాంత వాదులు కనబడుతుంటారు, సమాజంలో విభేదాలు అసహనం సృష్టిస్తున్నారు, కలిసి ఉండవలసిన వాళ్ల మధ్య దూరాలు పెంచుతున్నారు , జాతీయ జీవన స్రవంతిలో మైనారిటీలను కలిసిపోకుండా అడ్డం పడుతున్నారు , ఇది ఒక పెద్ద సమస్య హిందువులు ముస్లింలపై దాడులు చేస్తున్నారని ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వారి కుట్రలు భగ్నం చేయవలసిన సమయం ఆసన్నమైంది, లేకపోతే దేశంలో మరిన్ని సంఘర్షణలకు ఇది దారి తీసే అవకాశం ఉంది.
ముస్లిం సమన్వయం కోసం దేశంలోజరుగుతున్నా ప్రయత్నాలు
అట్లాగే ఈ దేశంలో మరో ప్రయత్నం ఈ మధ్యకాలంలో చాలా తీవ్రంగా జరుగుతున్నది, స్వాతంత్ర పోరాటం సమయంలో ముస్లిం లీగ్ దేశమంతా ముస్లిములను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందో అదేవిధంగా ఈమధ్య అంటే 2006 సంవత్సరంలో అటువంటిదే మరో సంస్థ ప్రారంభమైంది అదే PFI పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, దాని సిద్ధాంతాలు పని తీరుతెన్నులు సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
భారతదేశానికి దక్షిణ భాగంలో ఉన్న కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పని చేస్తున్న కొన్ని ముస్లిం సంస్థలు కలిసిపోయి 2006 నవంబర్లో PFI గా అవతరించింది. 1) కేరళలోని నేషనల్ డెవలప్ మెంట్ సంస్థ 2) కర్ణాటకలోని ఫోరమ్ ఫర్ డిగ్నిటీ 3) తమిళనాడులోని మనీత్ నీతి పసారి ఇవే కాక ఇంకా కొన్ని చిన్న చిన్న సంస్థలు దానిలో విలీనమై పోయాయి దానితో ముస్లింలకు దేశం లో ఒక ఫ్రంట్ ఏర్పడింది, అది ఈ రోజు దేశంలో 22 రాష్ట్రాలలో పనిచేస్తోంది దాని లక్ష్యం గురించి ఆ సంస్థల వాళ్ళ మాటలలోనే …….. దేశంలోని మైనారిటీ, దళితులు , మరియు సమాజంలోని బలహీన వర్గాల వారి కోసం పనిచేసే సంస్థ , ఈ సంస్థ కి కేరళలో పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ సి ఇ కోవా ప్రముఖ సిద్ధాంతకర్త మార్గదర్శకులు, దీని ప్రధాన కార్యాలయం కోజికోడ్ లో ఉండేది, ప్రస్తుతం అది ఢిల్లీకి మార్చబడింది, దీనికి ప్రాచ్య దేశాల నుండి విశేషంగా నిధులు సమకూరుతున్నాయి , ఈరోజు ఎక్కడ ఏ మూల దాడులు జరిగిన చివరకు ఈ సంస్థ వేరే బయటికి వస్తోంది పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనలు, కర్ణాటకలో హజిబ్ వివాదం వెనుక ది PFI ఉన్నది , అది ముస్లిం యువకులను ఏకం చేస్తున్నది కొన్ని దేశ వ్యతిరేక శక్తులతో కూడా సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది, ఈ సంస్థ సభ్యులకు ఒక డ్రెస్ కోడ్ కూడా ఉన్నది సిమి నిషేధిత సంస్థ సభ్యులు ఎక్కువమంది ఈ సంస్థలో ఉన్నారు. ఈ సంస్థ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించడం, సమస్యలపై ర్యాలీలు నిర్వహిస్తున్నారు . ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17న దేశమంతా అన్ని జిల్లా కేంద్రాలలో యాత్రలు నిర్వహిస్తూ ఉంటుంది, దీనికి అనుబంధంగా మానవ హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్ అంటే మహిళా విభాగం, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, కాకుండా ఒక రాజకీయ పార్టీ కూడా ఉన్నది. కేరళలో ఉన్న ముస్లిములీగ్ ను అధిగమించి శక్తి వంతంగా కేరళ రాజకీయాలను శాసిస్తున్నది . ఈ సంస్థ తో వామపక్ష సిద్ధాంత వాదులు ఢిల్లీ యూనివర్సిటీ దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలో ఉదారవాద మేధావులతో వీళ్లకు సంబంధం ఉన్నట్లు తెలుస్తున్నది , ఈ సంస్థలో దళితులను ఎక్కువగా భాగస్వామ్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అని తెలుస్తుంది, మొత్తానికి ఒక ప్రబలమైన శక్తిగా అవతరించే దిశలో దేశానికి సవాలు విసిరే శక్తిగా కూడా ఎదుగుతుందని అర్థమవుతోంది , ఇటువంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది, దేశంలో కేరళ తీర ప్రాంతం అట్లాగే అనేక సున్నితమైన ప్రదేశాలు ఎప్పుడైనా సంఘర్షణలకు తెరలేచే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద దేశంలో ఇస్లాం తనదైన ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉన్నది అని చెప్పటం అతిశయోక్తి కాదు.
దేశం లో రాజకీయాలు అందులో ప్రధానంగా ప్రాంతీయ పార్టీ ల రాజకీయాలు ముస్లిం ల చుట్టూ తిరుగుతున్నాయి ముస్లిం లు వాళ్ళకు ఓట్ బ్యాంకు లు గా ఉన్నారు . రాజకీయం గ హిందువులు ఏకం కానంత వరకు పరిస్థితులలో పెద్ద మార్పుల రాకపోవచ్చు , దేశ భవిష్యత్ దృష్ట్యా హిదువులు సంఘటితం కావాలి అదే అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది.
– NewsBharatiyam