గ్రామంలోకి పాస్టర్ల బెడత పెరిగిందని తమకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారంటూ సిద్ధిపేట జిల్లాకు చెందిన పలువురు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో అన్యమత ప్రచారం ఎక్కువైందని…అనుమతి లేకుండా హిందువుల ఇళ్లల్లోకి దూసుకొచ్చి మత ప్రచారం చేస్తున్నారని పల్లె జనం మండిపడుతున్నారు. ఇక ఓబులాపూర్ యువకులైతే మత ప్రచారంకోసం వచ్చిన వాళ్లను అడ్డుకున్నారు. అందరినీ ఊరు దాటించి రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఇళ్లల్లోకి వచ్చి బలవంతంగా మతమార్పిళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.