ఓ యువతికి నిమిషాల వ్యవధిలోనే డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. హయత్నగర్ మండలం అబ్దల్లాపూర్ మెట్లో ఓ యువతికి నిమిషాల వ్యవధిలో రెండో డోసు వేసింది ఆ నర్స్..దీంతో యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది.
కుంట్లూరు రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన లక్ష్మీ ప్రసన్న వ్యాక్సిన్ వేసుకునేందుకు అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సు పద్మ ఆ యువతికి ఒక డోసు వ్యాక్సిన్ వేసింది. టీకా వేసిన విషయం తెలియక యువతి అలాగే కూర్చుండి పోయింది. అప్పుడే నర్సుకు ఫోన్ కాల్ రావడంతో ఆమె మాట్లాడుతూ.. యువతికి రెండో డోసు వాక్సిన్ కూడా ఇచ్చేసింది. దీంతో లక్ష్మీ ప్రసన్న వాక్సిన్ కళ్లు తిరిగి కింద పడిపోయింది.వెంటనే వనస్థలిపురం ఏరియా హాస్పిటల్కు తరలించారు. యువతిని ప్రత్యేక వార్డులో ఉంచి అబ్జర్వ్ చేస్తున్నారు..మూడురోజులనాటి ఘటన వెలుగుచూసింది