మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిందని వచ్చిన ఆరోపణలపై ఇద్దరు పార్టీ నేతలపై బీజేపీ వేటు వేసింది. ముహమ్మద్ ప్రవక్త ను దూషిందన్న ఆరోపణల కారణంగా బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను పార్టీ నుంచి సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ సస్పెండ్ చేసింది.
‘మీ అభిప్రాయాలు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి మిమ్మల్ని తక్షణమే తొలగిస్తున్నాం’’ అని నుపుర్ శర్మకు సందేశం పంపింది.
ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం అధ్యక్షుడు నవీన్కుమార్ జిందాల్ను కూడా పార్టీ బహిష్కరించింది. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులు మత సామరస్యానికి విఘాతం కలిగించాయని పేర్కొంది.
అయితే పార్టీ సస్పెండ్ చేసిన అనంతరం తన వ్యాఖ్యలపై నూపుర్ శర్మ క్షమాపణలు కోరారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్ధేశం కాదని, తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడితే, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు ట్విటర్ ద్వారా స్పందించారు. ఆమె తన వైఖరిని వివరిస్తూ “చాలా రోజులుగా మా మహాదేవ్ శివుడిని అవమానిస్తూ, అగౌరవపరుస్తుండటంతో నేను టీవీ చర్చలకు హాజరవుతున్నాను. జ్ఞానవాపి మసీదు వద్ద ఉంది లభించింది శివలింగం కాదు.. ఫౌంటెన్ అని ఎగతాళిగా చెబుతున్నారు. శివలింగాన్ని ఢిల్లీలోని రోడ్డు పక్కన ఉన్న గుర్తులు, స్తంభాలతో పోల్చడం ద్వారా కూడా వెక్కిరిస్తున్నారు. మా శివుడిని ఇలా నిరంతరంగా అగౌరవపరచడాన్ని నేను సహించలేకపోయాను. దీనిపై ప్రతిస్పందిస్తూ నేను కొన్ని విషయాలు చెప్పాను” అని నూపుర్ శర్మ చెప్పారు.
— Nupur Sharma (@NupurSharmaBJP) June 5, 2022
Naveen Kumar Jindal, expelled from BJP for allegedly expressing views on social media that vitiate communal harmony, says his remarks were not aimed at hurting religious sentiments of any community
— Press Trust of India (@PTI_News) June 5, 2022
దీనిపై కొంతమంది నెటిజన్లు నుపుర్ శర్మకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. #shameonbjp, #wesupportnupur అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు అత్యాచారం చేస్తామని, చంపేస్తామని బెదిరింపులు వస్తున్నందున నూపుర్ కు భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.