మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్మీడియాలో తప్పుడు సమాచారం షేర్ చేశారంటూ నూపుర్ శర్మసహా పలువురిపై డిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. శర్మతో పాటు నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సబానఖ్వీ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఇంకా షాదాబ్ చౌహాన్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా, పూజా షకున్ పైనా ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి. నూపుర్ శర్మ చేతులు నరికేస్తానని పోలీసుల ముందేహెచ్చరించిన రాజస్థాన్కు చెందిన మౌలానా ముఫ్తీ నదీమ్ మీదా కేసు పెట్టారు పోలీసులు.
మహ్మద్ ప్రవక్తను దూషించారనే ఆరోపణలపై నూపుర్ శర్మకు ముంబ్రా పోలీసులు సమన్లు జారీ చేసి, ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన మరునాడు ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలో నూపుర్ శర్మపై ఇప్పటికే కనీసం 2 ఇతర ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, ఒకటి ఇస్లామిక్ ఔట్ఫిట్ రజా అకాడమీ ఆదేశాల మేరకు మరియు మరొకటి ముంబ్రా పోలీస్ స్టేషన్లో నమోదైంది. అంతకుముందే నూపుర్ మీద ఆరోపణలు వస్తుండడంతో ఆమెతో పాటు నవీన్ జిందాల్ నూ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని..ఏ ఒక్క వర్గాన్ని, మతాన్ని అవమానించే భావజాలానికి బీజేపీ వ్యతిరేకమని పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు వేటు వేస్తున్నట్టు సస్పెన్షన్ లేఖలో పేర్కొంది బీజేపీ.
సస్పెన్షన్ లేఖను సోషల్మీడియాలో షేర్ చేశారు. అయితే అందులోని చిరునామా ఆధారంగా శర్మను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. శర్మ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు జూన్ 6 న కేసు నమోదు చేశారు.
మహారాష్ట్రలో అధికార శివసేన, ఎన్సీపీలు సైతం నూపుర్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ నిరసన తెలిపాయి. హౌసింగ్, మైనారిటీ మరియు వక్ఫ్ మంత్రి జితేంద్ర అవద్, ఎన్సిపి ముంబై చీఫ్ ఆనంద్ పరాంజపే, షాను పఠాన్ నేతృత్వంలోని నిరసనలో వందలాది మంది ప్రజలు వాహనాలను అడ్డుకుని వీధుల్లో గుమిగూడారు.హైదరాబాద్ కు చెందిన ఎంఐఎం నూపుర్ శర్మను చంపిన వారికి కోటి రూపాయల రివార్డ్ ప్రకటించింది. సరిహద్దు ఆవలి ఉగ్రసంస్థల నుంచి కూడా నూపుర్ కు బెదిరింపులు వచ్చాయి. మే 29న, పాకిస్థాన్కు చెందిన తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP) మద్దతుదారులు ‘దైవదూషణ’కు పాల్పడిన నుపుర్ తల నరికిన వారికి 5 మిలియన్ రూపాయల (సుమారు 19.5 లక్షల INR) పాకిస్థానీ రూపాయిల నగదు బహుమతిని ప్రకటించింది.
అయితే తన వ్యాఖ్యల్ని నూపుర్ సమర్థించుకున్నారు. జ్ఞానవాపిలో శివలింగం బయటపడినదగ్గర్నుంచీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని..తాము కూడా ఇస్లామిక్ విశ్వాసాలను ఎత్తిచూపగలమని ఆమె వాదించారు. ఆమెకు బెదిరింపులు ఇంకా వస్తూనే ఉన్నాయి. తీవ్రవాద సంస్థ అల్ ఖైదా కూడా ఇదే అంశంపై స్పందిస్తూ భారత్పై ఉగ్రదాడులు చేస్తామని బెదిరించింది.