పాతాల్ పూరీ మఠం చీఫ్ మహంత్ బాలక్ దాస్ హెచ్చరిక వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇస్లాంవాదులు ఇలాగే గొడవలు చేస్తే నూపుర్ శర్మకు మద్దతుగా 18 లక్షల మంది నాగ సాధువులు వీధుల్లోకి వస్తారని ఆయన అన్నారు. జూన్ 11న కాశీలోని ధర్మ పరిషత్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
వారణాసిలోని హర్తీర్థ్ లోని సుధాం కుటీలో ధర్మ పరిషత్ నిర్వహించారు. పాతాళ పూరీ మఠం ప్రధానార్చకుడు మహంత్ బాలక్ దాస్ సభకు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి కాశీలోని అనేక మఠాలు, పీఠాలు సహా అఖాడాల ప్రధాన అర్చకులు, నాయకులు, అలాగే అనేక ఇతర హిందూ సాధువులు, ఋషులు హాజరయ్యారు.
https://twitter.com/harshasherni/status/1536281890620993537?s=20&t=ruiE2T1paDFiIsgueGd_wg
మహంత్ బాలక్ దాస్ విలేకరులతో మాట్లాడుతూ.. రోజురోజుకూ అరాచకం విస్తరిస్తోంది. ఇప్పుడు అది కాస్తా శివుడిని ఎగతాళి చేసే స్థాయికి చేరుకుంది, దానిపై వారు జోకులు పేలుస్తున్నారు. వారు శివ లింగాన్ని డ్రిల్ చేసి ఫౌంటెన్ అని కూడా పిలిచారు. దీని తరువాత కూడా సనాతన ధర్మాన్ని పాటించే ప్రజలు శాంతిని కొనసాగించారు.
“కానీ ఈ రోజు అది లిమిట్ దాటింది. ఖురాన్లో ఏం రాశారో అదే నూపుర్ చేసింది. అది కూడా శివునిపై చాలా అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తుంటే ఆమె అవి ప్రస్తావించింది. సనాతనులు శాంతియుతంగా ఉంటారు, అయినప్పటికీ ఈ మతపెద్దలు మసీదుల నుంచి వచ్చి రాళ్లు విసరుతున్నారు.గందరగోళాన్ని వ్యాప్తి చేయమని పిలుపునిస్తున్నారు”అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాగే చేస్తే నూపుర్ శర్మను రక్షించడానికి నాగ సాధువులు వీధుల్లోకి వస్తారని మహంత్ బాలక్ దాస్ హెచ్చరించారు. “ఈరోజు మా ఆడబిడ్డను రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు! ఆమెకు ఏదైనా జరిగితే, ఈ సాదు కమ్యూనిటీ చూస్తూ ఉండదని గమనించండి, 18 లక్షల మంది నాగ సాధువులు రోడ్డుపైకి వస్తారు. మొత్తం సాధు సమాజం రోడ్డుపైకి వస్తుందని.. అప్పుడు ఏం జరుగుతుందో ఊహించండి” అని అన్నారు.