దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎన్సార్సీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నార్సీపై టీఎంసీ శ్రేణులు దుష్ప్త్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. దేశంలో ఇప్పటి వరకు ఎన్నార్సీ అమలు చేయలేదన్నారు. ఎన్నార్సీని అమలు చేసిన కూడా.. దేశం నుంచి ఒక్క గోర్ఖాను కూడా పంపిచమని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఏ గూర్ఖాకు ప్రమాదం ఉండదని భరోసా ఇచ్చారు. ఈ అంశంపై కేవలం టీఎంసీ మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ.. గోర్ఖాల్లో ఆందోళన రేకెత్తిస్తుందన్నారు. అంతేకాదు.. దీదీ ఇప్పుడు.. బెంగాల్ కంటే ఎక్కువ తన పేరునే తలుచుకుంటూ ప్రచారం చేపడుతున్నారని అన్నారు. మే 2వ తేదీన దీదీ రాజీనామా చేసేందుకు రెడీగా ఉండాలని ఎద్దేవా చేశారు.