57 రాజ్యసభ స్థానాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 సీట్లకు ఎన్నిక ఉంటుంది.
మే 24న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. జూన్ 1న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూన్ 3 నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు.
జూన్ 10న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు, అదే రోజు కౌంటింగ్ జరుగుతుందని ఈసీ పేర్కొంది.
ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు, తెలంగాణా నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.