కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామస్థుల ఫిర్యాదుకు స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్. ఆ గ్రామంలో అక్రమంగా నిర్మించిన ఐఎంబీ చర్చి, క్రైస్తవ ఆచారాలు పాటిస్తూ కూడా కొందరు ఎస్సీ సర్టిఫికెట్లు కలిగివుండటం, అక్రమ చర్చి విస్తరణలో భాగంగా సమీపంలోని ఉమా రామలింగేశ్వర ఆలయ ఉత్సవాలకు ఆటంకం కలిగించే రీతిలో అక్రమంగా ప్రహారీగోడ నిర్మాణం చేయడం, ఇదేమని ప్రశ్నించిన వారిపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులుంపెట్టడంపై ఏకమైన యావత్ గ్రామస్థులు.. దీనిపై దాదాపు 3 నెలలకు పైగా పోరాటం సాగిస్తున్నారు.
తాజాగా గ్రామస్థులు ఫైల్ చేసిన పిటిషనుకు స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్, ఆ చర్చి నిర్మాణానికి సంబంధించిన నిజానిజాలు, తీసుకున్న చర్యల వివరాలు తమకు సమర్పించాల్సిందిగా కర్నూలు జిల్లా కలెక్టరుకు నోటీసులు జారీ చేసింది.
Courtesy : Chada Sastry