డిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ ఆదివారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీపై ఆయన్ని ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే ముఖ్యనాయకులు సహా పలువురిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారి రిమాండ్ రిపోర్టులో కేజ్రీవాల్ పేరును అధికారులు ప్రస్తావించారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇదే కేసుతో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానూ సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు ఉన్నాయంటూ…2022లో ఎల్జీ వినయ్ సక్సేనా కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదే కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ సైతం ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. ఇక తాజాగా సీబీఐనుంచి ముఖ్యమంత్రి కేజ్రీకి నోటీసులు రావడం చర్చనీయాంశమైంది.
https://twitter.com/ANI/status/1646845120736800769?s=20