ఏపీలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ టూరిజం, సాంస్కృతిక శాఖా మంత్రి రోజా స్పందించారు. ఎవరో స్నేహితుడు చెప్పిన మాటలు నమ్మి మీడియా ముందు మాట్లాడటం సరికాదని హితవు పలికారు.. నేను తెలంగాణ మంత్రి కేటీఆర్ ని మా రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నా, మా రాష్ట్రంలోని పథకాల అమలు దేశానికే ఆదర్శంగా ఉంది. సీఎం జగన్ పాలనలో అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని ఆమె అన్నారు. హ. వేసవి కారణంగా తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయని గుర్తుచేశారు. కేటీఆర్ ఏపీకి వచ్చి చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని మంత్రి రోజా బదులిచ్చారు.