ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ ను ఈనెల 24న కాకుండా 27న విచారణ జరగనుంది. 24న విచారిస్తామని మొదట తెలిపిన సీజేఐ తరువాత 27కు మార్చింది. ఇప్పటికే కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు.తన దగ్గరున్న 10 ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. అయితే ఆమెను విచారిస్తున్న ప్రతిసారీ అరెస్ట్ చేస్తారేమోననే ప్రచారం జరిగింది. ఈడీ మాత్రం ఆమెను ప్రశ్నించి వివరాలు మాత్రం రాబట్టుకుంటోంది.ఇక సుప్రీం ఈ నిర్ణయంతో కవితలో, బీఆర్ఎస్ లో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఈడీ తదుపరి నోటీసులు వస్తే కవిత అరెస్ట్ గ్యారంటీ అనే ప్రచారం మళ్లీ జోరందుకుంది.