బీబీసీనే కాదు ఎవరైనా సరే , ఏ సంస్థలైనా ఇక్కడి చట్టాలను పాటించాల్సిందేనని భారత విదేశాంగమంత్రి జైశంకర్ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన బ్రిటన్ విదేశాంగమంత్రి జేమ్స్ క్లెవర్లీతోనే ఈ మాటన్నారు జైశంకర్. ఈ సందర్భంగా ఇరు దేశాల విదేశాంగమంత్రులు ముఖ్యమైన ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు. ఈసందర్భంగా ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడుల గురించి క్లెవర్లీ ప్రస్తావించారు. అయితే భారత్ లో పనిచేసే ఏ సంస్థలైనా ఇక్కడి చట్టాలను పాటించాల్సిందేనని ఆయన మొహంమీదనే భారత విదేశాంగమంత్రి స్పష్టం చేశారు. జీ-20 ఎజెండాపైనా ఇద్దరు అభిప్రాయాలు పంచుకున్నామని ట్విట్టర్లో క్లెవర్లీ షేర్ చేశారు.