అటవీభూముల్లో ఇకనుంచి ఒక్క చెట్టునూ కొట్టేయనీయబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇష్టం వచ్చినట్టు అడవులు నరికేయడం సరికాదన్నారు. 11.5 లక్షల పోడు భూములు పంపిణీ చేస్తామన్న కేసీఆర్ రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భమూలు ఉన్నాయని గుర్తు చేశారు.అన్ని పార్టీలు ఒప్పుకుంటే ఆ మొత్తం భూమికీ పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. తరువాత రైతుబంధు, విద్యుత్. తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో అటవీ సంపద కావాలా…కనుమరుగు కావాలా అని ప్రశ్నించిన కేసీఆర్… పోడుభూముల దురాక్రమణను అడ్డుకుంటామన్నారు. గుత్తికోయలను తీసుకువచ్చి అడవులను నరికివేయిస్తున్నారన్న సీఎం… అటవీ అధికారులపై దాడులు సరికాదన్నారు.