నాగాల్యాండ్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇవాళ దిమాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈశాన్యరాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా చూస్తోందని..తాముమాత్రం అష్టలక్ష్ములుగా భావిస్తున్నామని ఈ సందర్భంగా మోదీ అన్నారు. రాష్ట్రంలో శాంతి స్థాపన కోసం ఆర్ముడ్ ఫోర్సెస్ చట్టాన్ని తొలగించామని మోదీ గుర్తు చేశారు. గత పాలకులు ఈశాన్య భారతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని..కానీ తాము అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత రూపురేఖల్ని మార్చామని చెప్పుకొచ్చారు.బీజేపీ ఎన్నడూ మతం, ప్రాంతం ఆధారంగా వివక్ష చూపలేదని ఆయనన్నారు.ఈ సందర్భంగా సంప్రదాయ నాగా తలపాగాను ధరించారు మోదీ.