కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్న కేరళలో హత్యా రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కేరళ ఓబీసీ మోర్చా కార్యదర్శి , న్యాయవాది రంజిత్ శ్రీనివాసన్ ను దుండగురు దారుణంగా హత్య చేశారు. అలెప్పుజాలోని ఆయనింట్లో కుటుంబసభ్యుల ముందే నరికి చంపారు.
అంతకు కొద్ది గంటలముందు సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్రకార్యదర్శి కేఎస్ షాన్ ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తుండగా దుండగులు కారుతో ఢీకొట్టి దాడి చేశారు. కొనఊపిరితో ఉన్న ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ చనిపోయారు. రెండు వరుస హత్యలతో నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అక్కడ పరిస్థితి నివురుకప్పిన నిప్పులా ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.