ఉత్తరప్రదేశ్ కైరానా అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన మరునాడే ఎస్పీ సిట్టింగ్ ఎమ్మెల్యే నహిద్ హసన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై గతంలోనూ పలు క్రిమినల్ కేసులున్నాయి. యూపీలో వెలుగులోకి రాని హిందువులు వలసల వెనక సూత్రధారి నహిదేనన్నది ప్రచారంలో ఉంది. కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా నహిద్ ను చెబుతారు. దాదాపు 11 నెలల క్రితమే…2020 జనవరి 15 పోలీసులు గ్యాంగ్ స్టర్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రెండురోజుల క్రితం ఆయన్ని అరెస్ట్ చేసి పటిష్ట భద్రత నడుమ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
సమాజ్ వాదీ పార్టీ ఇటీవలే ప్రకటించిన మొదటి విడత అభ్యర్థుల జాబితాలో కైరానానుంచి నహిద్ హసన్ పేరుంది. 2022 ఎన్నికలకు సంబంధించి మొదటి దశలో నామినేషన్ దాఖలు చేసిన మొదటి వ్యక్తి నహిద్.
అయితే మరునాడే కైరానా కొత్వాలి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. కైరానా నుంచి రెండుసార్లు ఎన్నికయ్యాడు నహిద్. అయితే షామ్లీ పోలీసులు పలువురి ఫిర్యాదు ఆధారంగా గ్యాంగ్ స్టర్ యాక్ట్ ప్రయోగించారు. పలువురి అదృశ్యం, కనిపించని హిందువుల వలసల సూత్రధారులంటూ… నహిద్ అతని తల్లి అయిన మాజీ ఎంపీ తబస్సుం హసన్ తో పాటు 40 మందిపై యూపీ పోలీసులు గ్యాంగ్ స్టర్ యాక్ట్ విధించారు. నాటి నుంచి వారి విచారణ కొనసాగుతోంది. పలుల్యాండ్ సెటిల్మెంట్ కేసుల్లోనూ తల్లీకొడుకులపై ఆరోపణలున్నాయి. నహిద్ హసన్ కైరానా నుంచి ఎస్పీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన తల్లి తబస్సుమ్ హసన్ కైరానా నుంచి ఎంపీగా ఉన్నారు.

File photo