
వచ్చేఏడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మపురస్కారాల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సమాజ సేవలో ఉన్న వారి పేర్లను పీపుల్స్ పద్మ అవార్డులకు నామినేట్ చేయాలని పిలుపునిచ్చింది. నామినేషన్ లను ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు https://padmaawards.gov.in పోర్టల్ కు పంపాల్సి ఉంటుంది. వివిధ కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ప్రజాసంబంధాలు, సేవ, సివిల్ సర్వీస్, వాణిజ్యం వంటి రంగాల్లో విశిష్ఠ సేవలు అందించేవారికి భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలు ఇస్తుంది.