నొక్కు కూలి అంటే మీరు వేరే వారి చేత కానీ స్వంత మనుషుల చేత కానీ యంత్రాల చేత కానీ పని చేయించుకున్నా కేరళలో కమ్మీ యూనియన్స్ కి తప్పనిసరిగా చెల్లించుకోవాల్సిన ముడుపులు.
ఈ జాడ్యం కేరళలో చాలా ఎక్కువ. ఉదాహరణకు ఒక వ్యాపారి లారీలో సామానులు తన స్వంత కూలీలతో సహా కేరళ పంపించి అక్కడ ఆ సామాన్లు తన కూలీలను ఉపయోగించి దింపుకున్నా అక్కడ వుండే కమ్యూనిస్ట్ యూనియన్ కి ఈ నొక్కు కూలి చెల్లించాల్సిందే. దీనిపై ఫిర్యాదులు ఎక్కువ రావడంతో కేరళ ప్రభుత్వం 2018లోనే ఈ ప్రాక్టీస్ పై నిషేధం విధించింది.
అయినా ఈ ప్రాక్టీస్ ఆగలేదు. మరీ ఎక్కువ అయి ఈ యూనియన్స్ అందరిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండటంతో ఈ మధ్య ఎవరో కేరళ హై కోర్ట్ కి వెళితే కేరళ హై కోర్ట్ ఈ ప్రాక్టీస్ వెంటనే ఆపాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.. అయినా అక్కడ ఉన్నది కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి కోర్ట్ ఆర్డర్ కాగితాలు మీదే ఉంది కానీ నిజంగా ఆచరణకు నోచుకోలేదు.
ఈ విషయం మళ్ళీ ఎలా బయటపడింది అంటే
2021లో త్రివేంద్రంలో ఉన్న విక్రమ్ సరాభాయి అంతరిక్ష కేంద్రానికి పెద్ద పెద్ద లారీల్లో ఇక్విప్మెంట్ వచ్చింది. అయితే తమకు నొక్కు కూలి క్రింద ₹10లక్షలు చెల్లించక పోతే ఆ ఆ లారీలను విక్రమ్ సెంటర్ లోకి అనుమతించం అని చెప్పి కార్మిక సంఘాలు రోడ్ బ్లాక్ చేశాయి.
నాలుగు గంటలకు పైగా లారీలను అడ్డుకున్నారు.
ఆ పెద్ద ఈక్విప్మెంట్ కార్మికుల చేత దింపడానికి కుదరదు, హైడ్రాలిక్ మెషీన్లు ఉపయోగించాలి అందుచేత కార్మికుల సేవలు అవసరం లేదు అని అంతరిక్ష కేంద్రం అధికారులు చెప్పినా, కార్మిక సంఘాలు ఒప్పుకోలేదు.
చివరికి కేరళ కార్మిక శాఖా మంత్రి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తే ఆయన కలుగచేసుకుని పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తే కానీ కార్మిక సంఘాల నాయకులు ఆ లారీలను వదలలేదు.
ఈ ఉదంతం కేరళ సీపీఎం ప్రభుత్వానికి చెడ్డ పెరుతెచ్చిపెట్టింది. అసలే కమ్యూనిస్ట్ రాజ్యంలో పెట్టుబడులు పెట్టడానికి అందరూ జంకుతూ ఉంటే ఇటువంటి సంఘటనలు కేరళ రాష్ట్రానికి నష్టం కలుగ చేస్తాయని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారు.