కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవానికి మోదీతో కలిసి హాజరైన బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు అయోధ్యను సందర్శించారు. సీఎంలతో పాటు పలు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలూ కొత్తగా నిర్మిస్తున్న రామాలయం, ఇతర ఆలయాలు సందర్శించారు. ఆతిథ్య సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, నాగాలాండ్ సీఎం నైఫియు రియో, మణిపూర్ సీఎం ఎన్. బీరెన్ సింగ్, త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేవ్, గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కొన్ని రాష్ట్రాల డిప్యూటీ సీఎంలతో కలిసి అయోధ్యలో పర్యటించారు.
ఇంకా సిక్కిం, మేఘాలయ, మిజోరాం, కర్ణాటక, పుదుచ్చేరి సీఎంలు కూడా అయోధ్య రాముడిని దర్శించుకున్నారు.
బుధవారం ఉదయమే అయోధ్య చేరుకున్న వారంతా రామజన్మభూమిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు.
బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అయోధ్యలో పర్యటించారు.
“గొప్ప రామమందిరాన్ని నిర్మించుకోవాలన్నది భారతీయులందరి కోరిక.. కోట్లాది భారతీయుల కల త్వరలోనే సాకారం అవుతుంది అని ఆయన అన్నారు. ఇక ఒకే సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో సీఎంలు అయోధ్యను దర్శించడం ఇదే మొదటిసారి.
ఇక కాశీ కారిడార్ ప్రారంభోత్సవం తరువాత బీజేపీ సీఎంలు,డిప్యూటీ సీఎంలతో సమావేశమైన ఫొటోలను మోదీ ట్విట్టర్లో షేర్ చేశారు.