ఎఫ్-16 యుద్ధ విమానాలకు సంబంధించి పాకిస్థాన్తో అమెరికా చేసుకున్న ఒప్పందంపై మండిపడ్డారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. పాకిస్థాన్ చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు మద్దతుగా ఎఫ్-16 విమానాల ఒప్పందం చేసుకున్నామని అమెరికా రక్షణ శాఖ ప్రకటననూ ఆయన తప్పుపట్టారు. అమెరికా మాటలు నమ్మడానికి ఇక్కడెవరూ తెలివితక్కువవాళ్లు లేరని… ఎఫ్-16 యుద్ధ విమానాలను ఎక్కడ, దేని కోసం ఉపయోగిస్తారో అందరికీ తెలుసనీ అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్లో భారతీయులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ మాటలు అన్నారాయన. వాషింగ్టన్ పోస్ట్తోపాటు మరికొన్ని ప్రధాన పత్రికలు భారత్ గురించి తప్పుడు వార్తలు రాస్తున్నాయని..భారత వ్యతిరేక ప్రచారాన్ని అమెరికా మానుకుంటే మంచిదని హితవు పలికారు.