దేశంలోని కుహనా, తుక్డే గుంపు.. మొన్నటికి మొన్న తమిళనాడులో క్రైస్తవ మిషనరీ ఆగడాలకు బాలిక లావణ్య బలైతే కనీసం స్పందించలేదు. ప్రియాంక రాహుల్ సహా వీళ్లెవరూ మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ బాధితురాలు హిందువు కనుక. బీజేపీ మతరాజకీయం చేస్తోందని గగ్గోలు పెట్టే వీళ్లు సమయం దొరికితే చాలు ప్రతిదానికీ మతం రంగు పులుముతుంటారు. నిజమే హిజాబ్ ముస్లిం మహిళల హక్కే. కానీ ఒక డ్రెస్ కోడ్ పెట్టుకుని… యూనిఫాం నిబంధనలతో నడిచే విద్యాసంస్థల్లో ఆ హక్కు చెల్లదు కాక చెల్లదు. ఏ మతానికి చెందిన వారైనా సరే ఆ నియమాలు పాటించాల్సిందే. అందుకు ఎవరికీ మినహాయింపు అక్కర్లేదు.