రోజుకోరకం ప్రకటనతో వార్తల్లో నిలుస్తున్న రాజకీయ వ్యూహకర్త మళ్లీ మాటమార్చారు. ఇప్పట్లో పార్టీ పెట్టబోనని తెలిపారు. అయితే ప్రజల నాడి తెలుసుకోవడానికి అక్టోబర్ 2 నుంచి బీహార్లో 3,000 కిలోమీటర్ల మేర ‘పాదయాత్ర’ చేపట్టనున్నట్లు తెలిపారు. యాత్ర ద్వారా వీలైనంత ఎక్కువమందిని కలుస్తానంటున్నారు.బీహార్లో “నయీ సోచ్, నయా ప్రయాస్ తీసుకురావడానికి ..తన మిషన్లో ఇది ఒక భాగమని పేర్కొన్నారు. దాదాపు 17,000-18,000 మందితో మాట్లాడబోతున్నానని అన్నారు.
“నేను జీరో నుంచి ప్రారంభించాలనుకుంటున్నా. రాబోయే 3-4 సంవత్సరాలను జన్-సూరజ్ (ప్రజా సుపరిపాలన) ఆలోచనతో ప్రజలకు చేరువవుతాను అన్నారు పీకే.