హిందుత్వ కార్యకర్త, శివ ప్రతిష్ఠాన్ హిందుస్థాన్ వ్యవస్థాపకుడు శంభాజీ భిడేపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని భీమా కోరేగావ్ కేసు నుంచి ఆయన పేరును తొలగించినట్లు మహారాష్ట్ర పోలీసులు మహారాష్ట్ర రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (MSHRC)కి నివేదించారు. 2018 కోరెగావ్-భీమా హింసలో ఎలాంటి పాత్ర పోషించలేడని కేసు నుంచి భిడేను తొలగించినట్లు పేర్కొంది. ఆ ఏఢు జనవరి 1న జరిగిన భీమా కోరేగావ్ హింసాకాండలో భిడే సహా ఇతరులపై SC/ST (ప్రివెన్షన్ అఫ్ అట్రాసిటీస్) చట్టం తోపాటు IPCలోని వివిధ సెక్షన్ల కింద పూణే పోలీసులు కేసు నమోదు చేశారు. దళిత కార్యకర్త అనితా సవాలే ఫిర్యాదు మేరకు భిడేతో పాటు మరో హిందుత్వ నాయకుడు మిలింద్ ఎక్బోటే పై కేసు నమోదు చేశారు.
పేష్వాలపై బ్రిటీష్ విజయం సాధించిన 200వ వేడుకలకు ముందు పుణె జిల్లాలో హింస చెలరేగింది. ఈ ‘విజయాన్ని’ వామపక్ష చరిత్రకారులు ‘దళితుల విజయం’గా మార్చారు.నాడు దళితులు,అట్టడుగు కులాల వారు బ్రిటిష్ వారి వైపు ఉన్నారు.
నాటి అల్లర్ల కేసులో న్యాయవాది ఆదిత్య మిశ్రా 2021లో MSHRCని ఆశ్రయించారు, మిస్టర్ భిడేపై కేసును ఉపసంహరించుకుంటామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో పేర్కొన్నారని.. అయితే అది ఇంకా జరగలేదని కమిషన్ కు చెప్పారు. మిశ్రా తన ఫిర్యాదులో, “ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరైనా ఏదైనా XYZని నిందితుడిగా చేర్చగలరా?” అని పేర్కొన్నారు. భిడేపై కేసుకు సంబంధించి పోలీసుల నుంచి స్టేటస్ రిపోర్టు కోరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దానిపై MSHRC స్పందిస్తూ ఆ తర్వాత పూణే రూరల్ పోలీసు అధికారులను పిలిపించి భిడేపై కేసులో స్టేటస్ రిపోర్ట్ను కోరింది.