హిందువుల మతవిశ్వాసాలు దెబ్బతీస్తూ పలువురి చేష్టలు, ప్రకటనలు వివాదాస్పదం అవుతున్న వేళ…అసోం ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంటి చీఫ్, ఎంపీ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే బక్రీద్ సందర్భంగా గోవధ వద్దు అని..గోమాంసం తినవద్దని పిలుపునిచ్చారు. హిందువులు తమ పూర్వీకులని..వాళ్లు పూజించే గోవులను చంపవద్దని అజ్మల్ విజ్ఞప్తి చేశారు.అదే సందర్భంలో ఈద్-ఉల్-అదా రోజున ‘ఖుర్బానీ’ చేయడం ముస్లింల విధి అని… ఈద్ రోజుల ఆవులను తినవద్దని పండగను హిందూసోదరులతో జరుపుకుందామని అన్నారు. అసోం పశువుల సంరక్షణ చట్టం 2021ని గౌరవించాలని బద్రుద్దీన్ అజ్మల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలోని చాలామంది సనాతన ధర్మాన్ని పాటిస్తారని గోవును తల్లిగా భావిస్తారని గుర్తుచేశారు. లోక్సభ ఎంపీ అయిన మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ అసోం స్టేట్ జమియత్ ఉలమా (ASJU) అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
మరికొన్ని కీలక వ్యాఖ్యలూ చేశారు అజ్మల్.ఆర్ఎస్ఎస్ హిందూ రాజ్ గా దేశాన్ని చేయడం ద్వారా హిందుస్తాన్ ను అంతం చేయాలనుకుంటోందని..అది వాళ్లకు కలగానే మిగిలిపోతుందని అన్నారు.