తాము అధికారం చేపట్టిన ఏడేళ్లలో ఎలాంటి అవినీతి జరగలేదని హోం మంత్రి అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) 94వ వార్షికోత్సవ సమావేశంలో హోంమంత్రి అన్నారు. ఆర్టికల్ 370, రామ జన్మభూమి వంటి సమస్యలను ఎలాంటి రక్తపాతం లేకుండా పరిష్కరించామన్నారు.
మేం తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని సరైనవి కావని అనగలరేమో తప్ప…మా ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయలేరనీ అన్నారు.
బీజేపీ సర్కారు ఏర్పడకముందు… 12 లక్షల కోట్ల అవినీతి, కుంభకోణాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందన్నారు.
“FICCI వంటి సంస్థలు తమ పాలసీ నిర్ణయాలకు అనుగుణంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D) లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ని పెంచే దిశగా కృషి చేయాలని హోంమంత్రి అన్నారు.
‘ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే పేదల అభివృద్ధి చాలా అవసరం. పేదల సంక్షేమ చర్యలపై పెట్టుబడి పెడితే జిడిపి పెరుగుతుంది” అని హోం మంత్రి అన్నారు.