బిహార్ సీఎం నితీష్ కుమార్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నలందాలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వేదికపైకి బాంబు విసిరాడు. అయితే నితీష్ కేం కాలేదు. వెంటనే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. భద్రతా సిబ్బంది వలయంలా ఏర్పడి సీఎంను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. గతంలోనూ పట్నా భక్కియార్ పూర్లో నితీష్ ప్రసంగిస్తుండగా ఇలాగే ఓ వ్యక్తి దాడి చేసి ఆయన చెంపలపై కొట్టాడు. తాజా ఘటనతో అక్కడున్నవారంతా షాకయ్యారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)