నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ (SECI)లో గుజరాత్, కేరళ తోపాటు పంజాబ్ మొదటి మూడు రాష్ట్రాలుగా నిలిచాయి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ ఈరోజు న్యూ ఢిల్లీలో స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ వన్ జాబితాను విడుదల చేశారు. చిన్న రాష్ట్రాలలో గోవా, త్రిపుర సహా మణిపూర్ రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, గ్లాస్గోలోని COP-26లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన పంచామృత లక్ష్యాల సాధన దిశగా ప్రయత్నాలను మార్చుకోవాల్సిన ప్రాధాన్యతను చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రాల పాత్ర కీలకం కానుందని అన్నారు. గవర్నెన్స్ ఇన్నోవేషన్, రాష్ట్రాల పరస్పర అభ్యాసం ఫలితాలను మెరుగుపరచడంలో చాలా దూరం వెళ్తాయని.. ఆ దిశలో SECI-రౌండ్ వన్ సరైన అడుగు అని అన్నారు.
అమితాబ్ కాంత్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక వాతావరణ లక్ష్యాలను సాధించాలంటే పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అనుకూలమైన వాతావరణం అవసరమని అన్నారు. స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ – 1 ఎనర్జీ సెక్టార్ పై రాష్ట్రాలతో సంభాషణను ప్రారంభించడానికి సహాయపడుతుందని, తద్వారా చాలా అవసరమైన విధానపరమైన మెరుగుదల చేయవచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)