రాజస్థాన్లో 1,357 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తొమ్మిది జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వర్చ్యువల్ గా ప్రసంగించిన గడ్కరీ, ఢిల్లీ-జైపూర్-కిషన్గఢ్ హైవే మరమ్మతుల కోసం 11 వందల కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. దీంతో ఈ హైవేలోని లోటుపాట్లు తొలగిపోతాయి.
రాజస్థాన్కు సిఆర్ఐఎఫ్లో తొమ్మిది వందల కోట్లు, సేతు బంధన్ పథకానికి 700 కోట్ల రూపాయల కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని శ్రీ గంగానగర్, బికనీర్, జైసల్మేర్ సహా బార్మర్ వంటి జిల్లాల్లోని రోడ్ల మరమ్మతులకు కూడా ప్రాజెక్టులు నడపనున్నట్లు ఆయన చెప్పారు. బార్మర్తో పాటు బలోత్రా వద్ద రెండు హార్బర్లను నిర్మిస్తామని గడ్కరీ తెలియజేశారు. దీనికి దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. జోధ్పూర్లో 1,200 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ రోడ్డు నిర్మిస్తాం, ఇది ట్రాఫిక్ను సులభతరం చేస్తుంది, అలాగే ట్రాఫిక్ జామ్ల నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
https://twitter.com/nitin_gadkari/status/1541330834233622529?s=20&t=ZLpgwMkyow15xZwHGslSqw