2023-24 బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మల రికార్డు సృష్టించారు. స్వాతంత్ర్య భారతంలో వరుసగా ఐదోసారి బడ్దెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా చరిత్రలో నిలిచారు. ఆ వరుసలో అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్నోహన్ సింగ్ , మొరార్జీదేశాయ్ ఉన్నారు. 2019లో ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెడుతూ వచ్చారు.