ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అన్న కొడుకు నిహార్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి తన మద్దతును అందించారు. నిజమైన శివసేనగా తమ వర్గాన్ని గుర్తించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ను ఆశ్రయించిన షిండే వర్గానికి ఇది ఎంతో ఊపునిస్తుంది. నిహార్ ఠాక్రే శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మనవడు. న్యాయవాది అయిన నిహార్ ఠాక్రే గత డిసెంబర్లో బీజేపీ నేత హర్షవర్ధన్ పాటిల్ కుమార్తె అంకితా పాటిల్ను వివాహం చేసుకున్నారు. 1996లో రోడ్డు ప్రమాదంలో మరణించిన నిహార్ ఠాక్రే తండ్రి బిందుమాధవ్ ఠాక్రే.. బాల్ ఠాక్రే ముగ్గురు కుమారులలో పెద్దవాడు; మిగిలిన ఇద్దరు జైదేవ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే.