కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో 2 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని యోగి సర్కార్ నిర్ణయించింది. డిసెంబర్ 25 నుంచి… రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో వివాహాలకు 200 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని, అందరూ కోవిడ్ భద్రతా ప్రొటోకాల్ ను పాటించాలని యోగీ తెలిపారు. అటు రెండు నెలల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టు ఈసీకి సూచించిన సంగతి తెలిసిందే.