లుథియానా పేలుళ్ల సూత్రధారి ముల్తానీనేని భావిస్తున్నారు. ఇక్కడి చట్టాల ప్రకారంముల్తానీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు అతనిపై ఆరోపణలున్నాయి. ఖలిస్తానీ మద్దతుదారైన అతను యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటాడు. ఇక పంజాబ్ లో ఎన్నికల ముంగిట రాష్ట్రంతో పాటు దేశంలోని పలు చోట్ల విధ్వంస రచనకు కుట్ర చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ముల్తానీని అరెస్ట్ చేయలేదంటూ SFJ కు చెందిన కీలక నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ రిలీజ్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
ముల్తానీని భారత్ కు తీసుకువచ్చి విచారిస్తే కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇతర దేశాల్లో యాక్టివ్ గా ఉన్న ఖలిస్తాన్ గ్రూపు సభ్యులపైనా ఎన్ఐఏ ఓ కన్నేసింది.డిసెంబర్ 23న లుథియానా కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడులో ఒకరు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి.