నిషేధిత పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయదర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో 56 చోట్ల దాడులు చేశారు. అయితే సోదాలకు ముందే ముగ్గురు కీలక వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు గుర్తించారు. పతినంతిట్టకు చెందిన వాళ్లంతా ఎన్ఐఏ బృందాలు వస్తున్నాయన్న సమాచారంతోనే ఇళ్లల్లోంచి పారిపోయారని అనుమానిస్తున్నారు. దాడులపై ఎన్ఐఏ ముందుగానే అక్కడి పోలీసులకు సమాచారం అందించింది. అయితే పీఎఫ్ఐ వాళ్లకి ఆ సమాచారం ఎవరు లీక్ చేశారనేదానిపై ఎన్ఐఏ విచారిస్తోంది.
పీఎఫ్ఐని ఇప్పటికే నిషేధించిన కేంద్రం… ఇంకా సంస్థ పేరుతో సాగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేక్రమంలో వరుస దాడులు నిర్వహిస్తోంది. ఆ సంస్థతో సంబంధాలున్న పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలింకా కొనసాగుతున్నాయి. పలు తీవ్రవాద సంస్థలతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధాలున్నట్టు తేలడంతో నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే పలువురి హత్యకు పాల్పడినట్టు ఆరోపణలున్న పీఎఫ్ఐ కార్యకర్తలను లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. సంజిత్ (కేరళ, నవంబర్ 2021), వి-రామలింగం (తమిళనాడు, 2019), నందు (కేరళ, 2021), అభిమన్యు (కేరళ, 2018), బిబిన్ (కేరళ, 2017), శరత్ (కమటక, 2017), ఆర్.రుద్రేష్ (కమటక, 2016), ప్రవీణ్ పుయారి (కర్ణాటక, 2016), మరియు శశి కుమార్ (తమిళనాడు, 2016) లను పీఎఫ్ఐ కి చెందినవాళ్లు హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. కేసులూ నమోదయ్యాయి.
Kerala: Three PFI leaders went missing in Pathanamthitta as soon as NIA started its crackdown across 56 locations during early morning raids@Viveknarayantw shares more details with @prathibhatweets. pic.twitter.com/SRKYCLEXbn
— TIMES NOW (@TimesNow) December 29, 2022
ఇక సంస్థకు ఆర్థికసాయం అందించిన తిరువనంతపురంలోని నెడుమంగడ్, తొన్నక్కల్, పల్లిక్కల్కు చెందిన పలువురి ఇళ్లల్లోనూ దాడులు జరిగాయి. పతనంతిట్టలోని పీఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రషీద్ , రాష్ట్ర కమిటీ సభ్యుడు నిజార్ ఇళ్లల్లోనూ…నెడుమంగడ్, తొన్నక్కల్, పల్లిక్కల్తో పాటు రాష్ట్రంలోని కొల్లాం, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ నగరాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.సంస్థకు ఆర్థిక సాయం అందించిన వాళ్లనూ ఎన్ఐఏ విచారిస్తోంది.ఇళ్లల్లో సోదాలు చేస్తోంది.
దేశంలో శాంతి, ప్రశాంతతకు భంగం కలిగించమే లక్ష్యంగా, ప్రజల్లో బీభత్సం సృష్టించే లక్ష్యంతో పీఎఫ్ఐ కార్యకర్తలు అనేక నేరాలకు పాల్పడమే కాక..పలువురిని క్రూరంగా హత్య చేశారని గతంలో హోంమంత్రిత్వ శాఖ పేర్కొన్నసంగతి తెలిసిందే.
పీఎఫ్ఐకి అంతర్జాతీయ ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయని..ముఖ్యంగా సంస్థకు చెందిన కొందరు కార్యకర్తలు… ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియాలో చేరారన్న ఆధారాలున్నాయని MHA తెలిపింది. దేశవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ ప్రదేశాలలో ఏజెన్సీ సోదాలు నిర్వహించింది. అయితే సోదాల తరువాత ఎవర్నైనా అదుపులోకి తీసుకున్నారా అన్నది ఇంకా తెలియలేదు.