తమిళనాడులో తిరుచ్చి(తిరుచిరాపల్లి)లోని హై-సెక్యూరిటీ స్పెషల్ క్యాంపులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది, ఇక్కడ క్రిమినల్ కేసులకు సంబంధించి విదేశీ పౌరులు, మరీ ముఖ్యంగా శ్రీలంక పౌరులు ఉన్నారు. ఆపరేషన్ ను చాలా గోప్యంగా ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోదాలు కొనసాగుతున్నందున పారామిలటరీ బలగాలకు చెందిన సాయుధ సిబ్బందిని శిబిరం వద్ద మోహరించారు.
తమిళనాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తుంది, ఇందులో ఖైదీలు తమపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించడం ద్వారా విడుదలయ్యేందుకు తరచుగా నిరసనలు చేస్తారు.
శిబిరంలో ఉన్న కొంతమంది శ్రీలంక జాతీయులకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం మేరకు NIA సోదాలు నిర్వహిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. NIAలోని ఇన్వెస్టిగేటర్లు.. డ్రగ్ పెడ్లర్ల అంతర్జాతీయ లింకులు, వారి మూలాలు, సప్లై&రవాణా మార్గాలను ట్రాక్ చేస్తున్నారు.
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(LTTE)ని పునరుద్ధరించడానికి నిధులను సేకరించేందుకు కొంతమంది శ్రీలంక జాతీయులు మాదకద్రవ్యాల వ్యాపారాన్ని ఆశ్రయిస్తున్నారని ఏజెన్సీ పేర్కొంది.