గతేడాది ఏప్రిల్లో కేరళ పాలక్కాడ్ జిల్లాలో దారుణ హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ హత్యకేసులో మరో ప్రధాన నిందితుడు…నిషేధిత పీఎఫ్ఐ సభ్యుడిని ఎన్ఐఎ అరెస్ట్ చేసింది. హత్య జరిగిననాటినుంచి నిందితుడు సాహీర్ పరారీలో ఉన్నాడు. అతనిపై నాలుగు లక్షల రివార్డ్ ఉంది. ఎన్ఐఏ ఫ్యుజిటివ్ ట్రాకింగ్ టీమ్ (ఎఫ్టిటి) ట్రాక్ చేసి పాలక్కాడ్ లో బంధువుల ఇంట్లో ఉన్న అతన్ని అరెస్ట్ చేసింది. సాహిర్ పీఎఫ్ఐ పట్టాంభి ఏరియా ప్రెసిడెండ్. శ్రీనివాసన్ ను చంపడం ద్వారా ఓ వర్గంలో భయాందోళనలు రేకెత్తించడమే పీఎఫ్ఐ లక్ష్యం. అంతేకాక 2047నాటికి భారత్ ను ఇస్లామిక్ కంట్రీగా మార్చే కుట్రలోనూ వారీ మారణకాండకు తెగబడుతున్నట్టు తేలింది. శ్రీనివాసన్ హత్య కేసులో పీఎఫ్ఐ సభ్యులు సహా మొత్తం 59మంది నిందితులపై ఎన్ఐఏ చార్జిషీట్ వేసింది. ఈ నిందితుల్లో ఒకరైన అబ్దుల్ నాజర్ ఈ ఏడాది జనవరి 2న మరణించాడు. పరారీలో 11 మంది నిందితులను ట్రాక్ చేసే ప్రయత్నాల్లో టీంలున్నాయి.