
రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ప్రతిపాదించారంటూ వస్తున్న వార్తల్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. ఉదయం నుంచి సోషల్మీడియాలోనూ, పలు మీడియా చానళ్లలోనూ ఈ వార్త హల్ చల్ చేసింది. అయితే అవన్నీ వదంతులేనని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. 2022 నాటికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. దీంతో తదుపరి రాష్ట్రపతి ఎవరనేదానిపై చర్చ నడుస్తోంది. శరద్ పవార్, మాయావతి, గులాంనబీ ఆజాద్ లు రాష్ట్రపతి రేసులో ఉన్నారని మొన్నటివరకు చర్చ నడిచింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)




